ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్ శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు.378 ఎస్సై పోస్టులుఎస్సై విభాగంలో మొత్తం 378 పోస్టులు ఉన్నాయి. ఇందులో సివిల్ ఎస్సై పోస్టులు 253, ఆర్మ్డ్ రిజర్వ్ (AR) 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) 9 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఎస్సై విభాగంలో కమ్యూనికేషన్ 50, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (PTO) 10 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది.
కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 1,156 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సివిల్ కానిస్టేబుల్, ఆర్మ్డ్ రిజర్వ్ తదితర విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను APSLPRB నోటిఫికేషన్లో వెల్లడించనుంది.
పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. దరఖాస్తుల ప్రక్రియ, ప్రిలిమినరీ పరీక్ష, తదుపరి ఎంపిక ప్రక్రియకు సంబంధించిన తేదీలను APSLPRB త్వరలో వెల్లడించనుంది. అభ్యర్థులు అధికారిక ప్రకటనలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, పరీక్షలకు ముందుగానే సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.
